Saturday, February 13, 2010

వరదలు మనిషి లో ఉన్న మలినం కడిగేస్తుందా ..?

పది మంది కుర్రాళ్ళు గడ్డ పారాలు తీసుకొని పోయ్యీ వేసారు,
ఇంకో పది మంది పక్క ఊరికి వెళ్లి బియ్యం వసూలు చేసారు,
కోట లో వంట సామాగ్రి తెచారు , పప్పు ఉప్పు నూనె ,కారం అన్ని వాటంతట అవ్వే వచాయీ ,
వంట చేస్తున్న వెంకటేశ్వర్లు ఇంకా కుర చెయ్యడమే ఆలశ్యం అన్నారు ,
ఇంతలో అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ , గొల్ల సుబ్బమ్మ కత్తి పీటలు ముందేసుకొని
కూరలు తరిమేశారు, పన్నెండు గంటల కల్ల దోసకయా పప్పు,పులుసు అన్నం తయారయ్యయీ ,
శెట్టి గారు విస్తారు కట్టలు ఇస్తే నడి బజారు లో బారులు గా వేసారు . శాస్త్రి గారు సంధ్యా వందనం ముగించుకొని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు , ఇటు పక్క చూస్తె తెలగ సుబ్బారాయుడు . ఇంకో పక్క గొల్ల రాముడు ఉన్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవాన్ నామ స్మరణలు సాగుతున్నాయి, ఇంతలో వడ్డనలు అయేపోయాయి
శాస్త్రి గారు అవుపోస పట్టే నెయ్యే కోసం చెయ్యే చాస్తే వద్దించాడనికి వచ్చిన నేతి జాడి చెంగు వెన్నక్కి వెళ్ళింది , వడ్డిస్తున్న మాల సంగడు శాస్రి గారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు అప్పుడు శాస్త్రి గారు "ఒరేయ్ సంగా! నీకు ఆకలేస్తుంది , నాకు అకాలేస్తుంది , ఇంకొకలు వేస్తె నెయ్యే నువ్వే వేస్తె నెయ్యే కాక పోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యీ ముందుకు చాచి , సంగడు ఆనందంగా వడ్డించాడు .... "నమో పర్వతే పతయే : " అనుకున్నారు అందరూ...
"వరదలూ వచ్చి మనిషుల మనసులు కడిగేసింది అని అనుకుందామా ? అబ్బీ నాకు నమ్మకం లేదు ! స్నానం చేసిన వొంటికి తెల్లారే తప్పదికి మల్లి మట్టి పట్టి నట్టు మనషుల్లో మల్లి మలినం పేరుకుంటుంది , ఎన్ని వరదోలోచిన మనషుల మనసులు కడగాలేకపోతుంది .

1 comment:

  1. చాలా బాగా వర్ణంచారు.
    గోరంత కధలో కొండంత ఆలోచన :P. సమాజంలో రావలసిన మార్పు గురించి చక్కగా చెప్పారు.

    మీ తదుపరి టపా కోసం ఎదుకుచూస్తూ....
    - ప్రణి

    ReplyDelete